December 9, 2016

శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల (నరసాపురం)

శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల (నరసాపురం) 

ఆలయ చరిత్ర 
భారతదేశంలో గల వైష్ణవ దేవాలయాలలో మద్రాసుకు సమీపంలో విరాజిల్లే శ్రీ పెరుంబుదూరులోని శ్రీఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివార్ల దేవాలయం ప్రశస్తమైనది. ఇందలి కేశవస్వామి భక్తుల క్లేశాలని తొలగిస్తాడు. సుందర కేశపాశం కలవాడు. బ్రహ్మరుద్రేంద్రాదులకు అధిపతి, పరమేశ్వర శాపానికి గురియైన భూతములు ఈ క్షేత్రంలో గల దేవాలయం చెరువులో స్నానం చేసి శాపాన్ని పోగొట్టుకున్నట్లు స్థల పురాణ ప్రవచనం. భక్తులకు ఉనికిని కలుగజేస్తుంది. కనుక దీనికి భూత పరిమని నామధేయమని వేదాంతుల నిర్వచనం. 

ఇట్టి క్షేత్రంలో భగవంతుని కోరిన మేరకు ఆదిశేషుడు రామానుజులుగా అవతరించి సంసారి చేతనులకు సులభమైన మోక్షోపాయాన్ని ప్రసాదించారు. ఇక్కడి శ్రీరామానుజులవారి విగ్రహం వారు జీవించి యున్న కాలంలోనే ప్రతిష్టింపబడింది. 

పరమపవిత్ర వశిష్టానది తీరవాసుల భాగ్యఫలంగా ఇప్పటికీ సుమారు 227 సంవత్సరాల పూర్వం 1786వ సంవత్సరంలో ప్రసన్నాగ్రేసర శ్రీ పుష్పాలరమణప్పనాయుడు గారు తమ గురువుగారైన ఉ..వే..శ్రీమాన్ ఈయుణ్ణి రామానుజాచార్యస్వామివారు కోరిన మీదట శ్రీపెరుంబుదూరు ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు.                  

ఆలయానికి ఎదురుగా కోనేరు ...... కోనేరు నిండా తామరలు 




వైష్ణవ మతప్రచారకులు శ్రీ రామానుజులవారి విగ్రహం అతను జీవించి ఉన్నప్పుడే ఇక్కడ ప్రతిష్టింపబడిందట.  







3 comments: