December 13, 2016

History Of Malluru Hemachala Nrusimhaswamy

History Of Malluru Hemachala Nrusimhaswamy
మల్లూరు హేమాచల నృసింహస్వామివారి ఆలయచరిత్ర

Simhachalam Giri Pradakshina

Simhachalam Giri Pradakshina

December 12, 2016

Tirupati Venkanna Uregimpu Utsavam

Tirupati Madaveedhullo Venkanna Uregimpu Utsavam

About Gurupournami ......By Satuluri Ravi,

About Gurupournami ......By Satuluri Ravi
గురుపౌర్ణమి గురించి సాతులూరి రవి (మా బావ) చెప్పిన వాక్యాలు


My Brother's Speech About Gurupournami

My Brother's Speech About Gurupournami
 గురుపౌర్ణమి గురించి మా అన్నయ్య చెప్పిన వాక్యాలు

History Sri Muktikaantaa Mukteeswaraswamy ...... Mukteeswaram

History Sri Muktikaantaa Mukteeswaraswamy ...... Mukteeswaram
శ్రీ ముక్తీకాంతా క్షణముక్తీశ్వరస్వామి చరిత్ర ..... ముక్తీశ్వరమ్

History Of Mangalagiri Nrusimhaswamy

History Of Mangalagiri Nrusimhaswamy
పానకాల నృసింహస్వామి ఆలయ చరిత్ర మంగళగిరి

History Of Sri Shakteeswara Swamy .......Yanamadurru

History Of Sri Shakteeswara Swamy .......Yanamadurru
శ్రీ శక్తీశ్వరస్వామివారి ఆలయ చరిత్ర ..... యనమదుర్రు

December 11, 2016

దివ్యక్షేత్రం వాడపల్లి

దివ్యక్షేత్రం వాడపల్లి - వాడనిమల్లి దివ్యచరిత్ర 

ఒకానొకసారి సనకసనందాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారయణున్ని దర్శించుకున్నారు. ఆయనను అనేక విధములుగా స్తుతించి తరవాత వారు వచ్చిన పనిని తెలిపారు. కలియుగంలో ధర్మం ఒంటిపాదంలో నడుస్తుంది.ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ కామక్రోధాలకు వశులై, అధర్మ జీవితం గడుపుతున్నారు. ఉపేక్షిస్తే అధర్మం మిగిలిన యుగాలకు కూడా ప్రాప్తిస్తుంది. కనుక ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని ఋషులు మహావిష్ణువుని అర్చించారు. అప్పుడు విష్ణువు ఈవిధంగా చెప్పాడు. 












అధర్మం ప్రబలినప్పుడు స్వయంగా యుగయుగమందున అవసరాలకు అనుగుణంగా వివిధ 
అవతారాలు ధరించాను. కానీ కలియుగంలో పాపభూయిష్టము ఎక్కువ అయ్యింది. కొద్ధి మాత్రమే పుణ్యాన్వితం. కావున కలియుగంలో అర్చాస్వరూపుడనై భూలోకమున లక్ష్మీక్రీడాస్థానమై మానవుల యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలె దరిచేర్చునది అగు  గౌతమీ తీరమున నౌకపురమును (వాడపల్లి) పురమందు వెలుస్తాను. 

లక్ష్మీదేవితో పాటు ఒక చందన వృక్ష పేటికలో గౌతమీ ప్రవాహ మార్గంలో నౌకపురి(వాడపల్లి) చేరుకుంటాను. ఈ వృత్తాంతం అంతా తెలిసిన నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు. 

కొంతకాలానికి నౌకపురి ప్రజలకు గౌతమీ ప్రవాహంలో కొట్టుకువస్తున్న చందాన వృక్షం కనిపించింది. తీరా ఒడ్డుకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించింది. ఒకరోజు గ్రామంలోని వృద్ధ బ్రాహ్మణులకు కలలో కనిపించి కాలికల్మషం వల్ల జ్ఞానం లోపించి మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు. కనుక పురజనులందరూ వేకువనే గౌతమీ స్నానంతో పవిత్రులై మనగళవాయిద్యాలతో నౌకలో నది గర్భంలోకి వెళితే కృష్ణగరుడ వాలిన చోట నేనున్నచందన పేటిక దొరుకుతుందని చెబుతాడు. పురజనులు స్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నదీగర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభిస్తోంది. దానిని ఒడ్డుకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖు చక్ర గదలతో ఒప్పుతున్న స్వామి దివ్యమంగళ విగ్రహం కనిపించింది. 

అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేశాడు. గతంలో ఋషులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలిసిందిగా విష్ణువును ప్రార్థించటం, విష్ణువు నౌకపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు చెబుతాడు. తరవాత మూడు మండపాలలో ఎత్తైన ప్రాకార గోపురాలతో దేవాలయం కట్టించేడు. "వేం" అంటే పాపాలను "కట" అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వేంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ఠింప చేసాడు. 

వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి నిలువెత్తు రూపం చూడగానే కళ్ళకు ఆకట్టుకుని తిరుమలేశుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది. భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి. వాడపల్లి తీర్థం అంటే వాడవాడలా ఉత్సవమే. ప్రతీఏటా చైత్రశుద్ధ ఏకాదశినాడు శ్రీ స్వామివారి తీర్థం, కల్యాణోత్సవం వైభవోపేతంగా  జరుగుతాయి. స్వామివారి బ్రహ్మోత్సవ, కల్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నులపండుగగా భక్తితో తిలకిస్తారు.

 స్వయంభూక్షేత్రమైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామివారిని వరుసగా 7 శనివారాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసి, స్వామిని దర్శిస్తే, భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయట. 7 శనివారాలు దర్శనాలు, ప్రదక్షిణలు పూర్తి అయిన తరవాత స్వామి ఆలయంలో అన్నదానం కోసం బియ్యం, పప్పులు, నూనెలు వారి స్థోమతను బట్టి 7 కుంచాలైనా, 7 కేజీలైనా, అదీ కాకపోతే 7 గుప్పెళ్ళు ఐనా సరే స్వామికి సమర్పించాలంట. 

భారతీయ ఔన్నత్యం Fritjof Capra

భారతీయ ఔన్నత్యం  Fritjof Capra

భారతీయ ఔన్నత్యం Alfred North Whitehead

భారతీయ ఔన్నత్యం Alfred North Whitehead

భారతీయ ఔన్నత్యం T.S.Eliot

భారతీయ ఔన్నత్యం T.S.Eliot

December 10, 2016

సుబ్భి గొబ్బెమ్మ సుబ్బడినివ్వవే

సుబ్బి గొబ్బెమ్మ  సుబ్బడినివ్వవే


సుబ్బి గొబ్బెమ్మ సుబ్బడి నీయ్యవే
అరటి పండు వంటి అమ్మ నీయ్యవే
నారింజ కాయంటి నాన్న నీయ్యవే
బంతిపువ్వంటి బావనీయ్యవే
తామరపువ్వంటి తమ్ముడినీయ్యవే
చేమంతి పువ్వంటి చెల్లెలినీయ్యవే
 అరటి పువ్వంటి అన్నయ్యనీయ్యవే
మల్లె పువ్వంటి మామనీయ్యవే
మొగలి పువ్వంటి మొగుడినీయ్యవే


శివకోడు

శివకోడు




ఈ ఆలయం రాజోలు నుండి పాలకొల్లు వెళ్ళే మార్గంలో జాతీయ రహదారి ప్రక్కన 2కిలోమీటర్ల దూరంలో ఉంది.  
శివకోడులో ఉన్న ఈ ఈశ్వర లింగాన్ని శ్రీఉమాశివలింగేశ్వర స్వామివారు అని అంటారు. రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. ఈ గ్రామంలో ప్రతిష్టించిన శివలింగంతో సంఖ్యామానం ప్రకారం కోటి పూర్తి అయ్యింది. అందువల్ల ఈ ప్రదేశాన్ని శివకోటిగా పిలిచేవారు. క్రమంగా ఈ పేరు రూపాంతరం చెందుతూ ప్రస్తుతం శివకోడుగా పిలవబడుతోంది.

ఎక్కడా మనం కనీవినీ ఎరుగనట్లుగా, ఇక్కడ శివలింగం మనకు అర్ధనారీశ్వరునిగా దర్శనమిస్తుంది. ఎక్కడైనా అర్ధనారీశ్వరుడు అంటే శివపార్వతులు ఉంటారు కదా! కానీ ఇక్కడ ఈ శివలింగం యొక్క  ఎడమభాగంలో పార్వతీదేవి, కుడిభాగంలో గంగాదేవి ఉంటారు. గంగమ్మతల్లి ఉన్న ప్రాంతంలో శివలింగంపై అడుగు లోతులో నీరు వస్తుంటుందని, అంటే నీరు ఊరుతూ ఉంటుందని చెబుతుంటారు. ఈ శివలింగంలోనే ఇద్దరు అమ్మవార్లు ఉండటంవల్ల కుంకుమపూజలు కూడా శివలింగం దగ్గరే చేస్తుంటారట. శివలింగాన్నైతే మేం దర్శించుకున్నాం కానీ, లింగంపై ఉన్న ఇద్దరి అమ్మవార్లను దర్శించుకోలేకపోయాం. ఎందుకంటే ఎప్పుడుపడితే అప్పుడు అమ్మవార్లను మనం దర్శించుకోలేం. ప్రతీరోజు ఉదయం 7గంటలకు స్వామివారికి అభిషేకం చేస్తారంట. ఆ సమయంలోనే శివలింగంపై ఉన్న అమ్మవార్లను మనం దర్శించుకునే అవకాశం ఉంటుంది. మేం వెళ్లేసరికి సాయంత్రం 6.15 అయ్యింది. అందువల్ల మేం miss అయ్యాం. దూరం నుండే శివలింగాన్ని దర్శించుకొని వచ్చేసాం.                           
    

December 9, 2016

దిగమర్రు ........ శ్రీ ఉమాసోమేశ్వరస్వామి

దిగమర్రు ........ శ్రీ ఉమాసోమేశ్వరస్వామి

పాలకొల్లు మరియు నర్సాపురం ప్రధాన రహదారిలో, పాలకొల్లుకి ఆరు కిలోమీటర్లదూరంలో ఈ ఆలయం ఉంది.
ఆలయ చరిత్ర 
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. అందులో భాగంగా మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టించాడు. చివర మూడు శివలింగాలని తీసుకువస్తుంటే సూర్యోదయం అయ్యిందని సంధ్యావందనం చేసుకునే ఉద్దేశంతో హనుమంతుని భుజంపై ఉన్న శివలింగాన్ని ఒక ప్రదేశంలో కిందకు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దండకారణ్య ప్రాంతమట. సంధ్య వార్చుకొని తిరిగి  వచ్చాక శివలింగాన్ని పైకి తీస్తుంటే ఎంతకీ రాలేదట. ఆ శివలింగం అక్కడే ప్రతిష్టించబడింది. మారుతి వచ్చి ఈ ప్రదేశంలో దిగాడు గనుక ఈ ప్రాంతానికి ''దిగుమారుతి'' అని పిలువబడింది. కాలక్రమేణా ఈ పేరు దిగమర్రుగా మార్పుచెందింది.

చిక్కాలలో ఉన్న శివదేవుడు మొదటి శివలింగంగానూ. రెండవ శివలింగం ఈ దిగమర్రులో ఉన్న శ్రీఉమాసోమేశ్వరస్వామివారి శివలింగంను, మూడవ శివలింగం శివకోడులోనూ ప్రతిష్టించబడ్డాయి. ఈ మూడు శివలింగాలని ఒకేరోజులో దర్శించినా, పూజలు చేయించినా, అభిషేకాలు చేయించినా.....శ్రీరాముడు భారతదేశం మొత్తంలో ప్రతిష్టించిన కోటి శివలింగాలని దర్శించినంత ఫలితం లభిస్తుందట.          








శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల (నరసాపురం)

శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ కోవెల (నరసాపురం) 

ఆలయ చరిత్ర 
భారతదేశంలో గల వైష్ణవ దేవాలయాలలో మద్రాసుకు సమీపంలో విరాజిల్లే శ్రీ పెరుంబుదూరులోని శ్రీఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివార్ల దేవాలయం ప్రశస్తమైనది. ఇందలి కేశవస్వామి భక్తుల క్లేశాలని తొలగిస్తాడు. సుందర కేశపాశం కలవాడు. బ్రహ్మరుద్రేంద్రాదులకు అధిపతి, పరమేశ్వర శాపానికి గురియైన భూతములు ఈ క్షేత్రంలో గల దేవాలయం చెరువులో స్నానం చేసి శాపాన్ని పోగొట్టుకున్నట్లు స్థల పురాణ ప్రవచనం. భక్తులకు ఉనికిని కలుగజేస్తుంది. కనుక దీనికి భూత పరిమని నామధేయమని వేదాంతుల నిర్వచనం. 

ఇట్టి క్షేత్రంలో భగవంతుని కోరిన మేరకు ఆదిశేషుడు రామానుజులుగా అవతరించి సంసారి చేతనులకు సులభమైన మోక్షోపాయాన్ని ప్రసాదించారు. ఇక్కడి శ్రీరామానుజులవారి విగ్రహం వారు జీవించి యున్న కాలంలోనే ప్రతిష్టింపబడింది. 

పరమపవిత్ర వశిష్టానది తీరవాసుల భాగ్యఫలంగా ఇప్పటికీ సుమారు 227 సంవత్సరాల పూర్వం 1786వ సంవత్సరంలో ప్రసన్నాగ్రేసర శ్రీ పుష్పాలరమణప్పనాయుడు గారు తమ గురువుగారైన ఉ..వే..శ్రీమాన్ ఈయుణ్ణి రామానుజాచార్యస్వామివారు కోరిన మీదట శ్రీపెరుంబుదూరు ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తూ నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంబెరుమానార్ స్వామివారి దేవాలయాన్ని నిర్మించారు.                  

ఆలయానికి ఎదురుగా కోనేరు ...... కోనేరు నిండా తామరలు 




వైష్ణవ మతప్రచారకులు శ్రీ రామానుజులవారి విగ్రహం అతను జీవించి ఉన్నప్పుడే ఇక్కడ ప్రతిష్టింపబడిందట.  







చిక్కాల శివదేవుడు

చిక్కాల శివదేవుడు 





పాలకొల్లుకి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో చిక్కాల శివాలయం ఉంది. కోవెల ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయములోని లింగము మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధము కలిగి తలభాగమునుండి చీల్చబడినట్లుగా చీలికతో ఉంటుందట.   
ఆలయ చరిత్ర 
రావణ సంహారం అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా దోషం నివారణకుగాను కోటి శివలింగాలని ప్రతిష్టించాలని అనుకున్నాడు. హనుమంతుని సహాయంతో శ్రీరాముడు కోటి శివలింగాల్ని ప్రతిష్టించాడంట. అందులో భాగంగా మొదటి శివలింగాన్ని రామేశ్వరంలో శ్రీరాముడు ప్రతిష్టించాడు. చివర మూడు శివలింగాలని తీసుకువస్తుంటే సూర్యోదయం అయ్యిందని సంధ్యావందనం చేసుకునే ఉద్దేశంతో హనుమంతుని చేతిలో ఉన్న ఒక శివలింగాన్ని దట్టమైన పొదవలె ఉన్న ప్రదేశంలో కిందకు పెట్టాడు. ఆ సమయంలో ఈ ప్రాంతమంతా దండకారణ్య ప్రాంతమట. సంధ్య వార్చుకొని తిరిగి  వచ్చాక శివలింగాన్ని పైకి తీస్తుంటే ఎంతకీ రాలేదట. ఆ శివలింగం అక్కడే ప్రతిష్టించబడింది. పొదల మధ్య చిక్కుకొని ఉండిపోవటం వలన ఇక్కడ శివదేవుణ్ణి చిక్కాల శివదేవుడు అని అంటున్నారు.

ఇది మొదటి శివలింగం. రెండవ శివలింగం దిగమర్రులోనూ, మూడవ శివలింగం శివకోడులోనూ ప్రతిష్టించబడ్డాయి. ఈ మూడు శివలింగాలని ఒకేరోజులో దర్శించినా, పూజలు చేయించినా, అభిషేకాలు చేయించినా.....శ్రీరాముడు భారతదేశం మొత్తంలో ప్రతిష్టించిన కోటి శివలింగాలని దర్శించినంత ఫలితం లభిస్తుందట.  

కొన్నివందల సంవత్సరాల క్రితం ఈ అడవి ప్రదేశాన్ని రైతులు వారి పొలాలకి అనువైన ప్రదేశమని తలచి, ఆ ప్రాంతాన్ని బాగుచేద్దామనే ఉద్దేశంతో గడ్డపార భూమిలో దించగానే, ఎర్రగా మరుగుతున్న రక్తం పైకి చిమ్మిందట. అది చూసి రైతులు భయపడి, ఆ విషయాన్ని ఆ ప్రాంతానికి రాజైన మొగల్తూరు రాజావారికి తెలియచేసారు. వెంటనే ఆ రాజావారు వచ్చి, శివలింగాన్ని బయటకు తీయించే ప్రయత్నం చేసారు. కూలీలు ఎంత లోతు తవ్వినా ఆ శివలింగం యొక్క మొదలు కానరాలేదు. అది శివుని మహిమే అని రాజావారు తలచి ఆ శివలింగాన్ని అక్కడే ఉంచి పూజలు, అభిషేకాలు చేసారంట. నేటికీ శివరాత్రినాడు, కార్తీకమాసంలోనూ, శివదేవునికి ప్రత్యేక ఉత్సవాలు జరుపుతూ ఉంటున్నారు.       

ఆలయంలోకి వెళ్లేముందు నరనారాయణుల నిలువెత్తు విగ్రహాన్ని మనం దర్శించుకోవచ్చును.
ఆలయ ముఖద్వారం 
ఆలయ ప్రాంగణం 
ఆలయ చరిత్ర 





ఇంకా పూజారులు దేవాలయం తలుపులు తియ్యలేదు. కానీ మా అదృష్టం దేవాలయం చెక్కతలుపులు వెయ్యకుండా గ్రిల్స్ వేసి తాళాలు వేశారు. పూజారి లేకపోయినా మేము శివయ్యని దర్శించుకోవటానికి ఏ ఆటకం లేదు.                   
      
శివాలయానికి ఎడమవైపున పార్వతి అమ్మవారి ఆలయం ఉంది. 

క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి ఆలయం శివాలయానికి కుడివైపున ఉంది.  
లక్ష్మీసమేత శ్రీమన్నారాయణుడు 

History Of Sree Jaganmohini Kesavaswamy Temple ...... Ryaali

History Of Sree Jaganmohini Kesavaswamy Temple ...... Ryaali
శ్రీ జగన్మోహినీ కేశవస్వామి వారి ఆలయ చరిత్ర..... ర్యాలి

History Of Vadapalli Venkateswaraswamy Temple

History Of Vadapalli Venkateswaraswamy Temple
వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి ఆలయ చరిత్ర  

Sri Umasomeswara Swami Temple ...... Digamarru

Sri Umasomeswara Swami Temple ...... Digamarru
శ్రీ ఉమాసోమేశ్వరస్వామి ఆలయం ......దిగమర్రు  

Ksheraramam ...... In Palakollu

Ksheraramam ...... In Palakollu .........పంచారామాలు.......పాలకొల్లులో ఉన్న క్షీరారామం

krishnastakam By .....Ram & Lakshman

krishnastakam By .....Ram & Lakshman

Bhagavatgeeta By...... Ram & Lakshman

Bhagavatgeeta By...... Ram & Lakshman

Nrusimha Stotram By Ram & Lakshman

Nrusimha Stotram By Ram & Lakshman

November 27, 2016

మల్లూరు హేమాచల నృసింహస్వామి క్షేత్రమహాత్మ్యం

మల్లూరు హేమాచల నృసింహస్వామి క్షేత్రవిశేషాలు 


ఆలయానికి చేరుకోవటానికి మొదటి ప్రవేశద్వారం - ఇక్కడనుండి ఆటోల ద్వారా చేరుకోవచ్చును. 
మా తమ్ముడి ఫ్యామిలీతో నేను కూడా ఈ ఆలయాన్ని చూడటానికి, స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళాను. ఈ ప్రాంతమంతా అటవీప్రాంతం అవ్వటం వల్లన రోడ్డుకి ఇరుప్రక్కలా ఎత్తైన చెట్లతో, కొండలు, గుట్టలతో వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. రోడ్డు పొడవునా, దారి అంతా కోతులు ఎక్కువగా కనిపించాయి. గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి, స్వామికి నైవేద్యానికి ఇద్దామని వస్తుంటే, చేతిలో ఉన్న కొబ్బరిచిప్పని లాక్కుని వెళ్ళిపోయాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి.        
      
సరే ఇక ఆలయ చరిత్ర విషయానికి వస్తే ...... ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు. ఈ క్షేత్రమంతా విహంగవీక్షణం చేస్తే అర్ధచంద్రాకారంలో ఉంటుందని అంటుంటారు. శాతవాహనశక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు కలలో సాక్షాత్కరించి గుహాంతర భాగంలో ఉన్నానని చెప్పారంట. మహారాజు కొంతమంది సైనికులతో అక్కడకు వెళ్ళి గుహను తవ్విస్తుండగా స్వామివారికి గునపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం కారుతూఉంటుంది. ఈ ద్రవం సంతానం లేనివారు తీసుకుంటే సంతానం కలుగుతుందని, పెళ్ళికాని వారు తీసుకుంటే పెళ్ళి జరుగుతుందని నమ్ముతుంటారు. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. నరసింహస్వామిని దర్శించుకోవడంవల్ల సమస్త శతృ బాధలు తీరుతాయంటారు.
ఆలయానికి చేరుకోవటానికి రెండవ ప్రవేశద్వారం

పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంలో  తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సాక్షాత్తు దేవతలే ఇక్కడి స్వామివారిని ప్రతిష్టించినట్లు చెబుతారు. 

ఆలయానికి చేరుకోవటానికి మెట్లమార్గం 



స్వామి వారికి ఆదిలక్ష్మీ(అక్క), చెంచులక్ష్మీ(చెల్లి)అను ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆలయంలో స్వామివారికి ఇరుప్రక్కల వీరిరువురి ఆలయాలు ఉన్నాయి.  

ఆదిలక్ష్మీ అమ్మవారు 

చెంచులక్ష్మీ అమ్మవారు 

క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి, శిఖాంజనేయ స్వాములున్నారు. 


ఆలయానికి మెట్లమార్గానికి ఎడమచేతి వైపు వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. 



ఆలయానికి ఎడమవైపు ఒక చిన్న కోనేరు ఉంది. మేము చూసిన సమయానికి అందులో నీరు లేదు.  
 

ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామివారి విగ్రహం మానవ శరీర ఆకృతిలో మెత్తగా ఉంటుంది. స్వామివారి మూర్తిని ఎక్కడ నొక్కి చూసిన మెత్తగా మానవ శరీరంగా దర్శనమిస్తుంది. స్వామివారి శరీరమంతా రోమాలు మనకు దర్శనమిస్తాయి. 
స్వామివారి మూల విగ్రహం 
మానవాకృతిలో అతి సున్నితంగా ఉండే ఇక్కడి లక్ష్మీనర్సింహ స్వామికి తైలాభిషేకం అతి ప్రీతికరమని అంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన లక్ష్మీనర్సింహస్వామికి దక్షిణ భారతదేశంలోనే మరే దేవాలయంలో ఇలా తైలాభిషేకం చేయరు.  

స్వామివారిని దర్శించే ముందు ధారల దగ్గరకి వెళ్ళి, తీర్థం తాగి, తలపై జల్లుకోవాలంట. మల్లూరు హేమాచల క్షేత్రాన్ని కాకతీయ రాణి రుద్రమదేవి సందర్శించి, ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చెబుతున్నారు.

ఇక్కడ రెండు  ధారలున్నాయి, వాటిని అక్క ఆదిలక్ష్మీధార, చెల్లి చెంచులక్ష్మీధార అని అంటారు. సర్వరోగ నివారిణి ఈ ధారలు అని చెబుతుంటారు. కాశీ గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవని నమ్ముతారు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్రదర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుందిట. హేమాచల క్షేత్రంలో కొండ మామిడి చెట్లు చాలా ఉన్నాయి. ఆకాశమంతా ఎత్తున్న మహా వృక్షాలు ఇక్కడ కనిపించాయి. 
అక్క ఆదిలక్ష్మిధార
చెల్లి చెంచులక్ష్మీధార

ఆదిలక్ష్మీ ధార దగ్గర చిన్న గుట్ట మీద హనుమంతుడు ఉన్నట్టుగా ఒక ఆలయం ఉన్నది. 
రామబంటు ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న శిఖాంజనేయుడి స్వామి విగ్రహం అతివీర భయంకరంగా ఉండే విగ్రహం భక్తులకు దర్శనమిస్తుందట. రోడ్డుకి అరకిలోమీటరు దూరంలో కాలిబాటలో వెళ్ళాలి అని అన్నారు. కానీ మాకు సమయం లేకపోవటంతో స్వామిని దర్శించలేకపోయాం. 

ఆలయ ప్రాంగణంలో కొన్ని ఆంజనేయ విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ ఆలయం కూడా ఉంది. 

ఆలయానికి వెళ్ళే త్రోవలోనే గుట్ట దైత్తమ్మ తల్లి (అమ్మవారి) విగ్రహం ఉంది.




   
ఈ ఆలయ నిర్వాహకులు ప్రతీ యేటా వైశాఖ మాసంలో లక్ష్మీనర్సింహస్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆలయ పూజారులు నర్సింహస్వామి జయంతి, స్వామి వారి కల్యాణం, రథోత్సవం, సదస్యం, తెప్పోత్సవం, నాకభలి(నాగబెల్లి), వసంతోత్సవం, మొదలగు ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. స్వామి కల్యాణం రోజున రాష్ట్ర గిరిజన సంక్షేమ, సాంస్కృతిక శాఖ మంత్రి హాజరై స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారంట. 

హైదరాబాదుకి సుమారుగా 300కి.మీ. వరంగలుకి 135 కి.మీ. దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే వరంగల్ నుండి మంగపేట వరకు బస్సులు ఉన్నాయి. మంగపేట నుండి ప్రైవేటు వాహనాల ద్వారా (ఆటోలు ఉన్నాయి) మల్లూరు లోని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. లేదా వరంగల్ నుండి ప్రైవేటు వాహనాల ద్వారా చేరుకోవచ్చు.  మేము మాత్రం కారులోనే బయలుదేరి వెళ్ళాం. హైదరాబాద్ నుండి 6 గంటల సమయం పట్టింది మేము ఈ క్షేత్రాన్ని చేరటానికి. ఉదయం 5 గంటలకి ఇల్లు దాటినవాళ్ళం, రాత్రి 9 అయ్యింది మళ్ళీ ఇల్లు చేరటానికి.  

అంతా బాగానే ఉంది కానీ, ఇక్కడ కొనుక్కుని తినటానికి చిరుతిళ్ళనేవి ఏవీ దొరకవు. దొరుకుతాయేమో మాకు తెలీదు. మేము వెళ్ళినప్పుడు అక్కడ మాకేమి కనిపించలేదు. పులిహోర, లడ్డు, రవ్వలడ్డు ఈ ప్రసాదాలు మాత్రమే అక్కడ అమ్మారు.
ఇవే ఆ ప్రసాదాలు 
ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఇక్కడ నిత్యాన్నదానసత్రం ఉంది. ఎవరొచ్చినా లేదు అనకుండా భోజనాలు పెడుతున్నారు. కానీ మేము ఇంటి నుండి కొన్ని items వండి తీసుకువెళ్ళాం. మేం అవే తిన్నాం. మా డ్రైవరు రాజు మేము తీసుకువెళ్ళిన వాటితో పాటు అక్కడ వారు వడ్డించిన అన్న ప్రసాదం కూడా తిన్నాడు.  
నిత్యాన్నదాన సదనం 

భోజనశాల 
సర్వేజనా సుఖినోభవంతు