December 29, 2013

Venkanna Udayaastamana Seva ---- Part 9

Venkanna Udayaastamana Seva ---- Part 9


Venkanna Udayaastamana Seva ---- Part 8

Venkanna Udayaastamana Seva ---- Part 7

Venkanna Udayaastamana Seva ---- Part 6

Venkanna Udayaastamana Seva ---- Part 5

Venkanna Udayaastamana Seva ---- Part 4

Venkanna Udayaastamana Seva ---- Part 3

Venkanna Udayaastamana Seva --- Part 2

Venkanna Udayaastamana Seva -- Part 1

తిరుపతిలో నారాయణవనం అనే ఊరిలో నేతకారులు మగ్గంపై బట్టలు నేయుట

తిరుపతిలో నారాయణవనం అనే ఊరిలో నేతకారులు మగ్గంపై బట్టలు నేయుట

December 16, 2013

ముత్యాల రంగవల్లికలు 8

ముత్యాల రంగవల్లికలు 8


ముత్యాల రంగవల్లికలు 7

ముత్యాల రంగవల్లికలు 7


ముత్యాల రంగవల్లికలు 6

ముత్యాల రంగవల్లికలు 6


ముత్యాల రంగవల్లికలు 5

ముత్యాల రంగవల్లికలు 5


ముత్యాల రంగవల్లికలు 4

ముత్యాల రంగవల్లికలు 4


ముత్యాల రంగవల్లికలు 3

ముత్యాల రంగవల్లికలు 3



ముత్యాల రంగవల్లికలు 2

ముత్యాల రంగవల్లికలు 2


ముత్యాల రంగవల్లికలు 1

ముత్యాల రంగవల్లికలు 1





December 15, 2013

కురుక్షేత్రం

కురుక్షేత్రం 

మహాభారత యుద్ధానికి ముందే కురుక్షేత్రం ప్రసిద్ధి చెందిన క్షేత్రమని భగవద్గీత శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. కౌరవులు - పాండవుల పూర్వీకులైన కురురాజులు, ఈ భూమికి తమ తపస్సు త్యాగానిరతితో, ధర్మభూమిగా మలిచారు. ఈ భూమిలోనే కురురాజులు తీవ్ర తపస్సు చేసారు, నాగలి దున్నారు. ఈ పవిత్రభూమి సరస్వతీ, ద్రుసధతి నదులమధ్య ప్రాంతంలో ఉన్నది. ఈ భూమిమీద నైమిశారణ్యం పవిత్ర తీర్థమైతే, మూడు లోకాలకి పవిత్రమైనది కురుక్షేత్రం. భక్తిశ్రద్ధలతో ఈ క్షేత్ర దర్శనం చేసుకుంటే, అశ్వమేధ, రాజసూయ యాగాలు చేసిన ఫలం దక్కుతుందట.
ఇక్కడే మహాభారత యుద్ధం జరిగింది. ఈ క్షేత్రం కౌరవ-పాండవులకు పూర్వీకులది అగుట వలన, ఇతరులకు హక్కు లేనందువల్ల, ఇరు పక్షాలవారు, కృష్ణుని సలహా మేరకు, ఈ ప్రాంతంలోనే యుద్ధం చేయటానికి ఒప్పుకున్నారు.
మనం ఎంతో పవిత్రంగా భావించే భగవద్గీత అర్జునుని నిమ్మిత్త మాత్రముగా పెట్టుకుని, శ్రీకృష్ణుని ద్వారా చెప్పబడినది. ఇక్కడే అర్జునునికి విశ్వరూపసందర్శనం కలిగినది. ఇక్కడే కృష్ణుని అనుగ్రహం వల్ల, భీష్మ పితామహుని ద్వారా, మనం నిత్యం చదువుకునే... "విష్ణుసహస్రనామం" లభించంది.
సూర్యగ్రహణ సమయంలో, కురుక్షేత్రాన్ని దర్శిస్తే మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు బలరామ, ఉగ్రసేనుల సమేతంగా ద్వారకనుండి, సుర్యగ్రహణ సమయానికి కురుక్షేత్రం వచ్చి, గోకులం నుండి వచ్చిన.... నందమహారాజుని, యశోదని తిరిగి కలుసుకున్నారని..... ప్రచారంలో ఉన్నది. శ్రీరామాచంద్రమూర్తి కుడా సీతాసమేతుడై.... తన తమ్ములతో సహా, పుష్పక విమానంలో వచ్చి సూర్యగ్రహణ సమయంలో సన్నిహిత సరోవరంలో స్నానమాచరించినట్లు చెబుతారు.

మహాభారత యుద్ధం ముగిసాక, కృష్ణుడు ... మునులు, ఋషులు సలహా మేరకు, యుద్దంలో మరణించిన తన బంధుమిత్రులకు, ధర్మరాజుచే పిండప్రధానము.... సన్నిహిత సరోవర తీరాన్న చేసారని చెబుతారు.

పరశురాముడు కురుక్షేత్రంలో 5 సరోవరాలు ఏర్పాటుచేసినట్లు వాడుకలో ఉన్నది. ఇక్కడ చాలా తీర్థాలు & దేవాలయాలు ఉన్నాయి, ఇవన్నీ చూడటానికి మనకు కనీసం ఒక వారం రోజులున్న సరిపోదు. ఈ ప్రాంతం ఢిల్లీ & హరిద్వార్ కి మధ్యనున్నది.


ఏకశ్లోకి భగవద్గీత

ఏకశ్లోకి భగవద్గీత


ఏకశ్లోకి రామాయణం

ఏకశ్లోకి రామాయణం



పరాశరముని చెప్పిన సూక్తి

పరాశరముని చెప్పిన సూక్తి





ప్రేమలు - రకాలు

ప్రేమలు - రకాలు


శ్రీకృష్ణ జోలపాట

శ్రీకృష్ణ జోలపాట


మంచి మాటలు

మంచి మాటలు

ఎన్ని పూజలు, నోములు, వ్రతాలు చేసేవారైనా దానబుద్ది లేకపోతే జీవితం ధన్యం కాదు. సత్కర్మలు చేసేవారు కోపం తెచ్చుకుంటే వారి పుణ్యకర్మ ఫలం నశిస్తుంది.

మారేడు దళానికి మధ్య దళము శివుడు అని, 
కుడివైపు దళము విష్ణువు అని
ఎడమవైపు దళము బ్రహ్మ అని అంటారు. మారేడు దళం కాశీ క్షేత్రంతో సమానం. 
మారేడు చెట్టు ఉన్నచోట శివుడు లింగరూపంలో నివసిస్తూ ఉంటాడు. 

మారేడు చెట్టు ఇంటికి ఈశాన్యమున ఉంటే - ఐశ్వర్యము కలుగుతుంది. తూర్పున ఉంటే - సుఖము కలుగుతుంది.  పడమరన ఉంటే - పుత్రసంతానం కలుగుతుంది. దక్షిణమున ఉంటే - యమబాధలు ఉండవు.    
 




























December 13, 2013

శ్రీగోదా అష్టోత్తర శతనామావళి

శ్రీగోదా అష్టోత్తర శతనామావళి 

 ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం గోదాయై నమః
ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
ఓం సత్యై నమః
ఓం గోపీవేషధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భూసుతాయై నమః
ఓం భోగశాలిన్యై నమః
ఓం తులసీకాననోద్భుతాయై నమః
ఓం శ్రీయై నమః                                                                     (10)

ఓం ధన్విపురవాసిన్యై నమః
ఓం భట్టనాధ ప్రియకర్యై నమః
ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
ఓం అమూక్త మాల్యదాయై నమః
ఓం బాలాయై నమః
ఓం రంగనాథ ప్రియాయై నమః
ఓం పరాయై నమః
ఓం విశ్వంభరాయై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం యతిరాజసహోదర్యై నమః                                             (20)

ఓం కృష్ణానురక్తాయై నమః
ఓం సుభగాయై నమః
ఓం సులభశ్రియై నమః
ఓం సలక్షణాయై నమః
ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
ఓం శ్యామాయై నమః
ఓం దయాంచిత దృగంచలాయై నమః
ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
ఓం రమ్యాయై నమః
ఓం ధనుర్మాసకృత వ్రతాయై నమః                                         (30)

ఓం చంపకాశోకపున్నాగమాలతీవిలసత్కచాయై మనః
ఓం ఆకారత్రయసంపన్నాయై మనః
ఓం నారాయణసమాశ్రితాయై మనః
ఓం శ్రీమదష్టాక్షరీమంత్రరాజస్థితమనోరథాయై మనః
ఓం మోక్షప్రదాననిపుణాయై మనః
ఓం మంత్రరత్నాధిదేవతాయై మనః
ఓం బ్రహ్మణ్యాయై మనః
ఓం లోకజనన్యై మనః
ఓం లీలామానుషరూపిణ్యై మనః
ఓం బ్రహ్మజ్ఞాయై మనః                                                    (40)

ఓం అనుగ్రహాయై నమః
ఓం మాయాయై నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
ఓం మహాపతివ్రతాయై నమః
ఓం విష్ణుగుణకీర్తనలోలుపాయై నమః
ఓం ప్రపన్నార్తిహరాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం వేదసౌధవిహారిణ్యై నమః
ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
ఓం మంజుభాషిణ్యై నమః                                           (50)

ఓం సుగంధార్థ గ్రంధకర్యై నమః
ఓం రంగమంగళ దీపికాయై నమః
ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంకమృదుపాదతలాంచితాయై నమః
ఓం తారకాకారనఖరాయై నమః
ఓం ప్రవాళమృదులాంగుళ్యై నమః
ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగాయై నమః
ఓం శోభనపార్షికాయై నమః
ఓం వేదార్థభావవిదిత తత్వభోధాంఘ్రి పంకజాయై నమః
ఓం ఆనందబుద్భుదాకార సుగుల్భాయై నమః
ఓం పరమాయై నమః                                             (60)

ఓం అణుకాయై నమః
ఓం తేజశ్శ్రియోజ్జ్వలధృతపాదాంగుళి సుభూషితాయై నమః
ఓం మీన కేతనతూణీర చారుజంఘావిరాజితాయై నమః
ఓం కకుద్వజ్జానుయుగ్మాఢ్యాయై నమః
ఓం స్వర్ణ రంభాభ సక్థికాయై నమః
ఓం విశాలజఘనాయై నమః
ఓం పీనసుశ్రోణ్యై నమః
ఓం మణిమేఖలాయై నమః
ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజనాభికాయై నమః
ఓం భాస్వద్వళిత్రికాయై నమః                              (70)

ఓం చారుజగత్పూర్ణమహోదర్యై నమః
ఓం నవమల్లీరోమరాజ్యై నమః
ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
ఓం కల్పమాలానిభభుజాయై నమః
ఓం చంద్రఖండనఖాంచితాయై నమః
 ఓం సుప్రవాళాహ్నాంగులి న్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
ఓం నవారుణ ప్రవాళాభపాణిదేశ సమంచితాయై నమః
ఓం కంబుకంఠ్యై నమః
ఓం సుచుబుకాయై నమః
ఓం బింబోష్ఠ్యై నమః                                        (80)

ఓం కుందదంతయుజే నమః
ఓం కారుణ్యరసనిష్యంది నేత్రద్వయ సుశోభితాయై నమః
ఓం ముక్తాశుచిస్మితాయై నమః
ఓం చారుచాంపేయనిభనాస్తికాయై నమః
ఓం దర్పణాకార విపుల కపోల ద్వితయాంచితాయై నమః
ఓం అనంతార్క ప్రకాశోద్యన్మణితాటంకశోభితాయై నమః
ఓం కోటి సూర్యాగ్ని సంకాశ నానాభూషణ భూషితాయై నమః
ఓం సుగంధ వదనాయై నమః
ఓం సుభ్రువే నమః
ఓం అర్థచంద్రలలాటికాయై నమః                  (90)

ఓం పూర్ణచంద్రాననాయై నమః
ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
ఓం సౌందర్యసీమాయై నమః
ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
ఓం ధగధ్ధగాయమానోద్యన్మణిసీమంత భూషణాయై నమః
ఓం జజ్జ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
ఓం సూర్యార్థచంద్రవిలసద్భూషణాంచిత వేణికాయై నమః
ఓం అత్యర్కానలతేజోధిమణికంచుకధారిణ్యై నమః
ఓం నిగన్నిగద్రత్నపుంజ ప్రాంతస్వర్ణ నిచోళికాయై నమః
ఓం సద్రత్నాంచితవిద్యోతవిద్యుత్కుంజాభ శాటికాయై నమః        (100)

ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహారిణ్యై నమః
ఓం అసంఖ్యేయసుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
ఓం శ్రీరంగనిలయాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం దివ్యదేశ సుశోభితాయై నమః                       (108)

ఓం శ్రీరంగనాయక్యై నమః
ఓం శ్రీమహాలక్శ్మై నమః
ఓం శ్రీభూదేవ్యై నమః
ఓం శ్రీనీళాదేవ్యై నమః
ఓం శ్రీగోదాదేవ్యై నమః
ఓం శ్రీఅనంతాయ నమః
ఓం శ్రీగరుడాయ నమః
ఓం శ్రీమతే విష్వక్సేనాయ నమః
ఓం శ్రీపరాంకుశాయ నమః
ఓం శ్రీమతే రామానుజాయ నమః
ఓం శ్రీమద్వరవరమునయే నమః
ఓం స్వాచార్యేభ్యో నమః
ఓం పూర్వాచార్యేభ్యో నమః

ఓం సమస్తపరివార సర్వదివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః



December 12, 2013

తిరుప్పావై పాశురాలు ---- ముప్పయవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ముప్పయవ పాశురము
వఙ్గ క్కడల్ కడైన్ద మాదవనై కేశవనై 
తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళై యార్ శెన్నిరైఞ్జి 
అఙ్గప్పరై కొణ్డువాత్తై, అణిపుదువై 
పైఙ్గమల త్తణ్డైరియల్ పట్టర్ పిరాన్ కోదై శొన్న 
శఙ్గత్తమిళ్ మాలై ముప్పదుమ్ తప్పామే 
ఇఙ్గప్పరిశురై ప్పారీరరణ్డు మాల్వరైత్తోళ్ 
శె ఙ్గణ్ తిరుముగత్తు చ్చెల్వత్తిరుమాలాల్ 
ఎఙ్గమ్ తిరువరుళ్ పెత్తిన్బురువ రెమ్బావాయ్ !
శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం....


భావం:-
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మదింపచేసి, లక్ష్మీదేవిని పొంది, మాధవుడైన వానిని బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగు వారును, విలక్షణ ఆభరణములు దాల్చినవారును, అగు గోపికలు చేరి, మంగళము పాడి 'పఱ' అను వాద్యమును లోకుల కొరకును, భవద్దాస్యమును తమకొరకు పొందిరి. ఆప్రకారమున అంతనూ లోకమునకు ఆభరణమై ఉన్న శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తమరపూసల మాలను మెడలో ధరించి ఉండు శ్రీభట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పది పాశురములతో మాలికగా కూర్చినది. ఎవరు ఈ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో వారు ఆనాడు గోపికలు ఆ కృష్ణుని నుండి పొందిన ఫలమును గోదాదేవి వ్రతమును ఆచరించి, పొందిన ఫలమును కూడా పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బహు శిరస్సులు కలవాడును, శ్రీవల్లభుడును, చతుర్భుజుడును అగు ఆ శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందమును ప్రసాదించును. 

అవతారిక:-
గోదాదేవి -- గోపికలు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రతసమాప్తి చేసి, వ్రత ఫలమును తాను కూడా పొందినది. శ్రీకృష్ణసమాగమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీరంగనాథుని భర్తగా పొందినది. శ్రీరంగము నుండి శ్రీరంగనాథుడు వ్రతసమాప్తి సమయమునకు తమ అంతరంగభక్తులను ఆండాళ్ తల్లి ఉన్న శ్రీవిల్లిపుత్తూరునకు పంపి ఆమెను శ్రీరంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను. అంత శ్రీభట్టనాథులు వారి శిష్యులుగా వల్లభరాయలతో సహా శ్రీరంగమునకు ఆండాళ్ తల్లిని తీసుకొని వెళ్ళెను. అచ్చట స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షమున శ్రీగోదాదేవిని తమతో చేర్చుకొనెను. అందుచేతనే గోదా - శ్రీరంగనాథ కళ్యాణ దినమునకు 'భోగి' అను వ్యవహారము కలిగెను. భోగము అనగా పరమాత్మానుభవమే. దానిని పొందిన దినము అగుటచే భోగి అనుట ఈ పండుగకు సార్థకము. 

ఈ వ్రతము అందరు ఆచరింపదగినది. ఈ వ్రతమును ఆచరింపలేకపోయినను, నిత్యము ఈ ముప్పది పాశురములు తప్పక అభ్యాసము చేయు వారికి కూడా తాను వ్రతము చేసి పొందిన ఫలము లభింపవలెనని గోదాదేవి ఈ పాశురమున ఆశించుచున్నది. 

గోదాదేవి తాను గోపికగానే వ్రతము చేసినది. ఫలము భగవత్ప్రాప్తి. అట్టి భగవానుడే అమ్మవారిని పొందుటకై చేసిన యత్నము పాలసముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. అందుచే మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటే, స్వామియే మనను పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమృతమథన వృత్తాంతము ఇందు కీర్తించుచున్నారు. ఈ ముప్పది పాశురములు పఠించినవారిని ఆనాడు పాలసముద్రమును మథింప చేసి లక్ష్మిని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నించి పొందును. ఈవిధంగా ఈ పాశురమున  ఫలశృతి చెప్పబడినది.      


                 

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైతొమ్మిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైతొమ్మిదవ పాశురము
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్ 
ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్ 
పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ 
కుత్తేవ లెంగళై క్కొళ్ళమల్ పోగాదు 
ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా ! 
ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో 
డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్ 
ముత్తిన ఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్ !



భావం:- 
బాగా తెల్లవారక మునుపే నీవు ఉన్నచోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరుపూవులు వలె సుందరములు రామణీయములైన పాదములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరవాతనే తాను భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను, స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి 'పఱ' ను పుచ్చుకొనిపోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికినీ .... ఏడేడు జన్మలకునూ నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములైన కోరికలు ఏవియూ లేకుండునట్లు చేయుము. 

అవతారిక:-
మార్గశీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతిపై వర్షమునకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము. పెద్దల సంతృప్తికే తాము స్నానవ్రతము ఆచరించుదుము అనియూ, ఆ వ్రతమునకు 'పఱ' అను వాద్యము కావాలెననియు బయలుదేరి శ్రీకృష్ణుని చేరి ఆ 'పఱ' ను ఇచ్చి తమకు ఆ వ్రతమును పూర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను, పరమాన్న భోజనములు చేయింపుము అని శ్రీకృష్ణుని ప్రార్థించిరి. ఈ గోపికలు 'పఱ' అనుచున్నది మామూలు పఱ కాదు. వీరు ఏదో కోరుతున్నారు .... వారే చెప్పుదురు - అని తాను మాటాడక ఊరకుండెను. అంత గోపికలు 'అయ్యో ! మన ఆర్తీ .... తొందర ఇతనికి తెలియుటలేదే అతడే ఉపాయము అని నమ్మినను , అతడే కాపాడునని ఊరక ఉండలేమే ' అని భగవద్విషయ రుచి తొందర పెట్టగా, తమ కోరికను శ్రీకృష్ణునికి తెలిపి నిత్యకైంకర్యమును - ఫలమును నీవే సమకూర్చవలెనని ఈ పాశురమున గోపికలు చెప్పుచున్నారు.       

   

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఎనిమిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఎనిమిదవ పాశురము
కఱవైగళ్ పిన్ శెన్రు క్కానమ్ శేర్ న్దుణ్బోమ్, 
అఱివొన్రు మిల్లాద వాయ్ క్కులత్తు ఉన్దన్నై 
ప్పిఱవి పె ఱున్దనై పుణ్ణియమ్ నాముడైయోమ్ 
కుఱైవొన్రు మిల్లాద గోవిన్దా !ఉన్దన్నోడు 
ఉఱవేల్ నమక్కి ఙ్గొళిక్క వొళియాదు 
అఱియాద పిళ్ళైగళోమ్, అన్బినాల్ ఉన్దన్నై 
చిఱుపేరళైత్తనవుమ్ శీఱి యరుళాదే 
ఇఱైవా నీ తారాయ్ పఱైయేలో రెమ్బావాయ్. !



భావం:- 
పశువుల వెంట వానిని మేపుటకై అడవికి పోయి, అచటనే శుచి నియమములు లేక తిని, జీవించి ఉండుటయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియూ జ్ఞానము లేని మా గోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మించిన పుణ్యమే మాకున్న పుణ్యము. మాకెన్ని లొపములున్నను తీర్చగల్గినట్లు ఏ లోపము లేనివాడవు కదా నీవు. గోవిందా ! ఓ స్వామీ ! నీతో మాకు గల సంబంధము పోగొట్టుకొన వీలుకాదు. లోకమర్యాద తెలియని పిల్లలము. అందుచే ప్రేమ వలన నిన్ను చిన్న పేరుపెట్టి పిలిచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములను అనుగ్రహింపక ఉండకము. మాకు ఆపేక్షితమగు 'పఱ' ను ఒసంగుము. అని గోపికలు అందరు స్వామికి శరణాగతిని చేశారు. తమ తప్పులను క్షమించమని క్షమాయాచన చేశారు. 

అవతారిక:-
భగవానునే ఉపాయముగా ఆశ్రయించువారు సర్వోపాయములను పరిత్యజించవలెను. అది వారి - వారి స్థితిని బట్టి భిన్న - భిన్నముగా ఉండును. కర్మ జ్ఞాన భాక్ష్యాద్యు ఉపాయములను ఇదివరకు సాధనములు అనుకొని ఆచరించినవారు వదలితిని అని నివేదించవలెను. వానిని ఆచరించుటకు అశక్తులు ఐనవారు .... స్వామీ ! నేను అట్టి సాధనములను ఆచరింప అసమర్ధుడను అనవలెను. ఆచరింపవలెనని తెలిసియూ తన స్వరూపమునకు తగదని ఆచరింపని వారు అవి మాకు తగినవి కాదు కదా ! అని అనవలెను. బొత్తిగా వాని విషయమునే తెలియని వారు నేను వేరొక ఉపాయముందని తెలియలేము స్వామీ ! అనవలెను. గోపికలు శ్రీకృష్ణుడు తప్ప వేరొక సాధనముండునని తెలియనివారు మాకేమియూ విడువదగినది లేదు స్వామి అని ఈ పాశురమున విన్నవించుచున్నారు.  


    

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఏడవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఏడవ పాశురము
కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా ! ఉన్దన్నై 
ప్పాడిప్పఱై కొణ్డుయామ్ పెఱుశెమ్మానమ్ 
నాడుపుగళుమ్ పరిశినాల్ నన్రాగ 
చ్చూడగమే తోళ్ వళైయే,తోడే శెప్పూవే,
పాడగమే,యెన్రనైయ పల్ కలనుమ్ యామణివోమ్, 
ఆడై యుడుప్పోమ్, అదన్ పిన్నే పాల్ శోఱు 
మూడ నెయ్ పెయ్ దు ముళఙ్గైవళివార 
కూడి యిరున్దు కుళిర్ న్దేలోరెమ్బావాయ్ !



భావం:-
తనతో కూడని శతృవులను జయించెడి కళ్యాణగుణసంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రత సాధనమగు 'పఱ' అను వాద్యమును పొంది, పొందదలచిన ఘన సన్మానము లోకులందరూ పొగడెడి తీరులో ఉండవలెను. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బహువులకు దండకడియములు, చెవి భాగమున దాల్చెడి దుద్దులు, పై భాగమున పెట్టుకొనెడి కర్ణ పూవులు, కాలి అందెయలు - గజ్జెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరించవలెను. తరువాత మంచి వస్త్రములు దరించవలెను. పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేయి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా - హాయిగా భుజించవలెను. 

అవతారిక:-
గోపికలు తాము ఆచరింపబోవు మార్గశీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాశురమున విన్నవించిరి. అందు వారు అడిగిన ద్రవ్యములు సులభములే ఐనను, వారు కోరిన గుణములుగల ద్రవ్యములు దుర్లభములు. అందుచే శ్రీకృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను కోరుటకాదు, నన్నే కోరి వీరు ఈ వస్తువులు కోరినారు అని అనుకొనెను. గోపికలు కోరిన పరికరాలన్నీ స్వామితో విడదీయరానివే. అంటే స్వామి తమతోనే ఉండాలని ధ్వనించే విధంగా గోపికలు చాలా చాతుర్యంతో వ్యవహరించారు. అనగా స్వామి గోపికలను సంపూర్ణంగా కటాక్షించాలని కోరారు.          


          

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఆరవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఆరవ పాశురము
మాలే ! మణివణ్ణా ! మార్గళి నీరాడువాన్ 
మేలైయార్ శెయ్ వనగళ్ వేణ్డువన కేట్టియేల్ 
ఞాలత్తై యెల్లామ్ నడుఙ్గ మురల్వన 
పాలన్న వణ్ణత్తు ఉన్ పాఞ్జశన్నియమే 
పోల్వన శఙ్గఙ్గళ్, పోయ్ ప్పాడుడై యనవే 
శాల ప్పెరుమ్ పఱైయే, పల్లాణ్డిశైప్పారే 
కోలవిళక్కే, కొడియే, విదానమే 
ఆలినిలైయాయ్ ! అరుళేలో రెమ్బావాయ్. !



భావం:-
ఆశ్రిత వ్యామోహము కలవాడా ! ఇంద్రనీలమణిని పోలిన కాంతియు, స్వభావము కలవాడా !అఘటితఘటనా సామర్ధ్యముచే చిన్న మఱ్ఱిఆకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరములు అర్థించి, నీవద్దకు వచ్చితిమి. ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరములను విన్నవించెదను. 

ఈ భూమండలమంతను వణుకునట్లు శబ్దము చేయు, పాలవలె తెల్లనైన నీ పాంచజన్యమనెడి శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద 'పఱ' అను వాద్యములు కావలెను. మంగళ గానము చేయు భాగవతులు కావలెను. మంగళ దీపములు కావలెను. ధ్వజములు కావలెను. మేలుకట్లు కావలెను. పై పరికరములను కృప చేయుము. అని గోపికలు శ్రీకృష్ణుని ఈ పాశురమున ప్రార్థించిరి. 

అవతారిక:-
భగవానుడే ఉపాయము, భగవానుడే ఫలము అని అని విశ్వసించి యుండు ప్రపన్నులు భగవానుని కంటే ఇతరములగు వానిని కాంక్షింపరాదు. మరొక వ్రతములను ఆచరింపరాదు. మార్గశీర్ష స్నాన వ్రతము, వ్రేపల్లెలోని పెద్దల అభిప్రాయమున వర్షార్థమై చేయు వ్రతము. గోపికల అభిప్రాయమున శ్రీకృష్ణ సంశ్లేషమే ఈ మార్గశీర్ష స్నానము. ఉపాయములలోకెల్ల శ్రేష్ఠమగు భగవానుని అనుభవమున అవగాహించుటయే మార్గశీర్షస్నానము. ఈ రెండు విధములుగా చేయు ఈ వ్రతమునకు ఆవశ్యకములగు పరికరములను గోపికలు ఈ పాశురములో కోరుచున్నారు. బాహ్యముగా పెద్దలకై చేయు వ్రతమునకు కావలసిన పరికరములను అంతరంగమున తమ భగవదనుభూతికి కావలసిన సామగ్రిని కోరుచున్నారు.        


తిరుప్పావై పాశురాలు ---- ఇరవైఐదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైఐదవ పాశురము
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్ 
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర, 
తరక్కిలా నాగిత్తాన్ తీఙ్గునినైన్ద 
కరుత్తైప్పిళ్ళైకఞ్జన్ వయిట్రిల్ 
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే ! యున్నై 
అరుత్తిత్తు వన్దోమ్ , పఱై తరుతియాగిల్ 
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి 
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్. !



 భావం:-
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా ! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి, వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపినా ఆశ్రిత వ్యామోహము కలవాడా ! నిన్నే కోరి వచ్చినారము. 'పఱ' అను వాద్యమును ఇచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము. 

అవతారిక:-
గోపికలు ఈ పాశురములో శ్రీకృష్ణుని జన్మరహస్యమును కీర్తించుచు దానివలన తమ శ్రమ తీరి ఆనందించుచున్నామని చెప్పుచున్నారు. కృష్ణుడు అవతరించిన తీరును, పెరిగిన తీరును తలచుకొని ఆ వాత్సల్యమునకు ముగ్ధులై ఆళ్వార్లు మూర్ఛనొందిరి. అట్లే గోపికలు వెనుకటి లీలలన్నిటికంటే చివరగా శ్రీకృష్ణ జనన ప్రకారము అనుభవించి పరవశలగుచున్నారు. 

గోపికలది జ్ఞానముతో కూడిన ప్రేమకాని కేవల వ్యామోహము కాదు. భగవత్తత్వముగా ఎరింగి ఆ పరతత్వము మనకై సులభముగా దిగివచ్చి, నాలుగు అడుగులు నడచి వచ్చిన మనలను చూచి శ్రమ అయినదని జాలి పడుచున్నాడే ? మనకై అతడు పడిన శ్రమలో మనము ఆతనిని పొందుటకై పడెడి శ్రమ ఎన్నవ వంతు ? అని అతని జన్మ ప్రకారము అనుసంధించుచున్నారు. 


                   

తిరుప్పావై పాశురాలు ---- ఇరవైనాల్గవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైనాల్గవ పాశురము
అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి 
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి 
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి 
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి 
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి 
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి 
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్ 
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్. !



భావం:-
ఆనాడు బలిచక్రవర్తి తనది కాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడింపగా ఈ లోకమునంతను వాని వద్ద నుండి దానము పట్టి పాదములతో కొలచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. 

రావణుడు సీతమ్మను అపహరించుకొనిపోగా ఆ రావణుండు లంకకేగి సుందరమగు భవనములు కోటయు గల దక్షిణదిశన ఉన్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహుపరాక్రమమునకు మంగళము. 

శ్రీకృష్ణుడు రక్షణకై ఉంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళం. 

వత్సముపై ఆవేశించిన అసురునితో వెలగచెట్టుపైన ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిపెలరాయి విసిరినట్లుగా వెలగచెట్టుపైకి దూడను విసురునపుడు ముందు - వెనుకలకు పాదములుంచి నిలచిన మీ దివ్యపాదములకు మంగళం. 

ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనను కోపముచే రాళ్ళవాన కురియగా గోపాలురకు, గోవులకు బాధకలుగుచుండునట్లు గోవర్ధన పర్వతమును గొడుగువలె ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. 

శత్రువులను సమూలముగా పెకలించి విజయమును ఆర్జించి ఇచ్చెడి మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. 

ఈ ప్రకారముగా నీ వీరే చరిత్రములనే కీర్తించి పరయనెడి వ్రతసాధనము నందగ మేము ఈనాడు వచ్చినారము అనుగ్రహింపుము. 

అవతారిక:-
ఈనాడు గోపికలు 'శయనాగారము నుండి ఇటు నడచివచ్చి సింహాసనమును అధిరోహింపుము.' అనుటతోడనే ఆశ్రిత సులభుడగు శ్రీకృష్ణుడు వారిమాట మీరలేక తన మంచము నుండి దివ్య సింహాసనము వరకు నడచి వచ్చెను. నీలాదేవియు ద్వారభూమి వరకు మంగళాశాసనము చేయుచు అనుసరించినది. గోపికలు నడచి వచ్చుచున్న స్వామిని చూచినారు. స్వామి నీలాదేవితో కూడా వచ్చి, దివ్య సింహాసనమును అధిరోహించిరి. ఒక పాదమును పాదపీఠంపై నుంచి రెండవ పాదమును తొడపైనిడుకొని కూర్చుండిన సన్నివేశమును చూడగానే, శ్రీకృష్ణుని దివ్యపాదముల ఎర్రదనము గోపికల కంటపడినది. తాము కోరిన ప్రకారము నడుచుట చేతనే పాదములు కందినవని గోపికల హృదయము కలతచెందింది. వెలుపలికి వచ్చి సింహాసనమున కూర్చొని మేము వచ్చిన కార్యమును పరిశీలించుమని అర్థించిన గోపికలు 'పఱ' అను వాద్యమును కోరుత మరచి మంగళము పాడుటకు ఉపక్రమించిరి. 

ఈ పాశురమున గోపికలు శ్రీకృష్ణపరమాత్మా వలన తమ కార్యము నెరవేర్ప జూచినవారై, ఆ ప్రభువు నడచివచ్చి ఆశనముపై కూర్చుండగానే ఆ పాదముల ఎర్రదనము చూచి తాము చేసిన అపచారమునకు ఖిన్నులై మంగళము పాదనారంభించిరి.                 


తిరుప్పావై పాశురాలు ---- ఇరవైమూడవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవైమూడవ పాశురము
మారిమలై ముళఞ్జిల్ మన్నిక్కిడన్దుఱఙ్గమ్ 
శీరియ శిఙ్గరివిత్తుత్తీ విళిత్తు 
వేరిమయిర్ పొఙ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి 
మూరి నిమిర్ న్దు ముళఙ్గిప్పురప్పట్టు 
పోదరుమాపోలే, నీ పూవైప్పూవణ్ణా ! ఉన్ 
కోయిల్ నిన్రిఙ్గనే ఫోన్దరుళి కోప్పుడైయ 
శీరియ శిఙ్గాపనత్తిరున్దు యామ్ వన్ద 
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్ !



భావం:-
పర్వత గుహలో వర్షాకాలమున కదలక మెదలక పరుండి నిద్రించుచున్న శౌర్యముగల సింహము మేల్కొని, తీక్షణమగు చూపులని ఇటుఅటు చూచి, ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడునట్లు చేసి, అన్నివైపులకు దొర్లి, దులుపుకొని, వెనుకకు - ముందుకు శరీరమును చాపి, గర్జించి, గుహనుండి బయటకు వచ్చునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేసి రమణీయ సన్నివేశముగల లోకోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుంగ ప్రార్థించుచున్నాము. 

అవతారిక:-
అనన్యగతికలమై వచ్చి నిన్ను ఆశ్రయించినాము కటాక్షింపుము. అని గోపికలు ప్రార్థింపగా, శ్రీకృష్ణుని మనసులో చాలా బాధకలిగెను. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్ళి సాయపడి రక్షింపవలసియుండగా, వేరొక గతిలేనివారము అని దైన్యముగా పలుకునట్లు ఉపేక్షించితినే ! ఎంత తప్పు చెసితిని అని కృష్ణుడు చాలా నొచ్చుకొనెను. స్త్రీలు ఇంట బాధపడుచుండగా ఊరకుండుట న్యాయముకాదు అని కృష్ణుడు బాధపడి, 'ఏమికావలెనో తెలపండి' అని గోపికలను అడిగెను.

గోపికలు తమ మనోరథము రహస్యముగా విన్నవించుటకు అంగీకరింపక సభామంటపమున విన్నవించవలెనని ఆస్థానమండపమునకు వేంచేసి తమ కోరికను పరిశీలింపవలెనని ఈ పాశురమున కోరుచున్నారు. 


          

తిరుప్పావై పాశురాలు ---- ఇరవై రెండవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవై రెండవ పాశురము
అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే 
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్ 
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే 
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేల్ విళియావో 
తింగళు మాదిత్తియను మెళున్దార్పోల్ 
అజ్ఞ్గణ్ణిరణ్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నోక్కుదియేల్ 
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్.



భావం:--
సుందరము విశాలము అగు మహాపృధివి మండలము అంతయు ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరు అనెడి అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నట్లు, మేమును అభిమాన భంగమైవచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరియున్నాము. చిరుగంట ముఖమువలె విడియున్న తామరపువ్వు వలె వాత్సల్యముచే ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయుము. 

సూర్యచంద్రులు ఇరువురు ఒక్కసారి ఆకసమున ఉదయించునట్లు ఉండెడి నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షించితివా ! మేము అనుభవించియే తీరవలెననెడి శాపము వంటి కర్మ కూడా మమ్ములను వీడిపోవును. 

అవతారిక:-
గోపికలు శ్రీకృష్ణపరమాత్మ వద్దకు చేరి మేల్కొనుమని వెనుక పాశురమున ప్రార్థించినారు. వేరొక గతిలేక నీకే చెందినవారము అని చెప్పినారు. వెనుకటి పాశురమున సూచింపబడిన అనన్య గతి తత్వమునే ఈ పాశురమున వివరించుచున్నారు. అభిమానము రెండు రకాలుగా ఉండును. సర్వము నాది అను అభిమానము మమతాభిమానము. దేహమే నేను , నేను స్వతంత్రుడను అనునది అహంతాభిమానము. వెనుకటి దానిలో శత్రువులు రాజ్యములను వదలి నీ వాకిటికి వచ్చినట్లు వచ్చితిమి - అని చెప్పిరి. తిరిగి రాజ్యము ఇచ్చినను స్వీకరింపుము. అని శత్రువులు నీ వాకిటనే ఉన్నట్లు ఉంటిమి. అని సర్వమునందు మమతాభిమానము వీడిపోయినట్లు చెప్పిరి. భగవానుని ఆశ్రయించునపుడు ఇతర సంబంధమును పూర్తిగా వీడి భగవానునికే చెందినవారము అను భావము పరిపూర్ణముగా ఉండవలెను. గోపికలు కూడా అట్లే ఈ పాశురమున తమ అనన్యార్హత్వమును విజ్ఞాపన చేయుచున్నారు.   


          

తిరుప్పావై పాశురాలు ---- ఇరవై ఒకటవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవై ఒకటవ పాశురము
ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప 
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్లల్ పెరుమ్ పశుక్కల్ 
ఆట్ర ప్పడైత్తాన్ మగనే ! యరివురాయ్ 
ఊట్రముడై యాయ్ ! పెరియాయ్ ! ఉలగినిల్ 
తోట్రమాయ్ నిన్ర శుడరే ! తుయిలెళాయ్ 
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్ 
ఆట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే 
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్ !



భావం:-- 
పొదుగు క్రిందనుంచిన కడవలు చరచరనిండి, పొంగిపొరలునట్లు ఆగక, పాలు స్రవించు అసంఖ్యాకములగు, ఉదారములగు బలసిన ఆవులుగల నందగోపుని కుమారుడా ! మేల్కొనుము. ప్రమాణదార్థ్యముగల మహామహిమ సంపన్నా ! ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూపా ! నిద్రనుంచి లెమ్ము, శతృవులు నీ పరాక్రమమునకు లొంగి మేముకూడా నిన్ను వీడియుండలేక నీ పాదములనే స్తుతించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి. 

అవతారిక:-
గోపికలు పురుషాకార భూతురాలగు నీలాదేవిని మేల్కొలిపిరి. ఆమె మేల్కొని 'నేను మీలో ఒకదానిని కదా ! నన్ను ఆశ్రయించిన మీకు ఎన్నడును లోపము ఉండదు. రండి. మనమందరము కలసి శ్రీకృష్ణుని మేల్కొలిపి అర్థింతుము.' అని తాను  శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి 'నీ గుణములకు ఓడి వచ్చినారము, అనుగ్రహింపుము'. అని ఈ పాశురమున నీలాదేవి  గోపికలతో కూడి శ్రీకృష్ణుని అర్థించుచున్నది.    


      

తిరుప్పావై పాశురాలు ---- ఇరవయ్యవ పాశురము

తిరుప్పావై పాశురాలు
ఇరవయ్యవ పాశురము
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ శెన్రు 
కప్పమ్ తవిర్కుమ్ కలియే తుయిలెళాయ్ 
శెప్పముడైయాయ్ తిఱలుడైయాయ్ ! శెట్రార్కు 
వెప్పమ్ కొడుక్కుమ్ విమలా తుయిలెళాయ్ 
శెప్పన్న మెన్ములైచ్చెవ్వాయ్ చ్చిరు మరుంగుల్ 
నప్పిన్నై నంగాయ్ ! తిరువే ! తుయిలెలాయ్ 
ఉక్కముమ్ తట్టొళియుమ్ తన్దున్ మణాళనై 
ఇప్పోదే యెమ్మై నీరాట్టేలే రెమ్బావాయ్. !



భావం:-- 
ముప్పదిమూడు కోట్ల అమరులకు, వారికింకను ఆపద రాకముందే పోయి, యుద్ధభూమిలో వారికీ ముందు నిలిచి, వారికీ శత్రువుల వలన కలిగెడి భయమును తొలగించెడి బలశాలీ ! మేల్కొనుము. ఆర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము కలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికీ భయజ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకొనుము. 

బంగారు కలశములను పోలిన స్తనములను, దొండపండు వాలే ఎఱ్ఱని పెదవులను, సన్నని నడుమును కల ఓ నీలాదేవీ ! మేల్కొనుము. వీచుటకు ఆలవట్టమును(విసనకర్రను) కంచుటద్దమును మాకు ఒసగి నీ వల్లభుడు అగు శ్రీకృష్ణునితో కలసి మేము స్నానమాడునట్లు చేయుము. 

అవతారిక:-
గోపికలు ఈ పాశురమున, నీలాదేవి - శ్రీకృష్ణులను మేలుకోలుపుచున్నారు. శ్రీకృష్ణ దర్శనం ఆలస్యమును ఓర్వలేక నీలాదేవిని నిస్టూరముగా "నీవు ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటును ఓర్వకుండుట న్యాయము కాదు. ఇది నీ స్వరూపమునకు, స్వభావమునకు తగదు." అని గోపికలు లెమ్మని పలికిరి. 

ఆమె మౌనమును ఓర్వలేక గోపికలు ఆమెను ఆశ్రయించినను కార్యము చేయువాడు అతడే కదా ! అని అని అతని గుణములనే కీర్తించి మేల్కొలిపెదమని కృష్ణునినే మేలికోలుపుచున్నారు. "మాకు ఈనాడు అనుగ్రహించనిచో -- పూర్వము అర్హులైన దేవతలకు సాయపడి, ఆర్జించిన నీకీర్తి అంతయు మాసిపోవును. నీవు నిర్మలుడవు అని, ఆర్జవము కలవాడివి అని లోకులు అనుకొనుచున్నారు. నీవు ఇట్లుండుత తగదు." అని శ్రీకృష్ణుని గుణములను కీర్తించి మేలుకొలుపుతున్నారు. 

స్వామి బలపరాక్రమములను, గుణజాతమును ప్రశంసించినను స్వామి కదలక - మెదలక ఊరకుండుటచే , గోపికలు నీలాదేవి సౌందర్యమును కీర్తించుచున్నారు. ఎన్నో విధములుగా మనలను రక్షించవలెనని స్వామితో చెప్పి చివరకు జగన్మాత అగు లక్ష్మీదేవి తన యవ్వనసౌందర్యమునకు ఆకర్షితుడు అగునట్లు విలాస విభ్రమములు ఒనర్చి, వశపరచుకొని మనలను స్వామి కటాక్షించునట్లు చేయును. అందుకే భక్తులు అమ్మ సౌందర్యమును వర్ణించుచున్నారు. అట్లు వర్ణించుట  తప్పుకాదా ! అని కొందరికి సందేహము కూడా కలుగును. కానీ జీవులను కాపాడునది అమ్మ సౌందర్యమే. ఆ సౌందర్యము లేనిచో... పరమాత్మ మనను రక్షించి ఉండడు. అందుచే గోపికలు కూడా ఈ పాశురమున నీలాదేవి యొక్క వక్షోజ, అధర, మధ్య సౌందర్యములను ప్రశంసించి, లేచి అనుగ్రహించుము అని అర్థించుచున్నారు.    


                                       

తిరుప్పావై పాశురాలు ---- పందొమ్మిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పందొమ్మిదవ పాశురము
కుత్తు విళక్కెరియ క్కోట్టుక్కాల్ కట్టిల్ మేల్ 
మెత్తెన్ర పఞ్చశయనత్తిన్ మేలేరి 
కొత్తలర్ పూజ్ఞ్గళల్ నప్పిన్నై కొంగైమేల్ 
వైత్తుక్కిడన్ద మలర్ మార్పా ! వాయ్ తిరవాయ్ 
మెత్తడజ్ఞ్కణ్ణినాయ్ నీ యున్మణాలనై 
ఎత్తనైపోదుమ్ తుయిలెళ ఒట్టాయ్ కాణ్ 
యెత్తనై యేలుమ్ పిరివాట్ర గిల్లాయాల్ 
తత్తువ మన్రుత్తగవేలో రెమ్బావాయ్. !



భావం:-
గుత్తి దీపములు చుట్టును వెలుగుచుండగా, ఏనుగు దంతములతో చేయబడిన కోళ్ళు గల మంచముపై ఉన్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము, ఎత్తు - వెడల్పు కలిగిన పాన్పుపై ఎక్కి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు .... తలలో ముడుచుకొనిన కేశపాశము గల నీలాదేవి యొక్క, స్తనములపై తన శరీరమును ఆనుకొని పరుండి, విశాలమైన కన్నులుగల ఓ నీలాదేవీ ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీయవు ? ఇంతమాత్రపు ఎడబాటుకూడా ఓర్వలేకుండుట నీ స్వరూపమునకు తగదు. 

అవతారిక:-
గోపికలు క్రిందటి పాశురములో నీలాదేవిని మేలుకొలిపి, ఈ పాశురమున శ్రీకృష్ణుని, నీలాదేవిని కూడా మేలుకొనవలసిందిగా  అర్థించుచున్నారు. పరమాత్మని ఆశ్రయించునపుడు అమ్మవారిని ఆశ్రయించి చేరవలెను. ఆశ్రయించిన తరవాత లక్ష్మి - నారాయుణులను ఇద్దరినీ సమానంగా సేవించవలెను. అందుకే గోపికలు ముందు నీలాదేవిని ఒక్కరినే మేలుకొలిపి, ఈ పాశురమున లక్ష్మినారాయణులను మేలుకొలుపుచున్నారు. 

తనని గోపికలు అర్థించిరికదా అని ...... నీలాదేవి తలుపులు తెరవబోయింది. ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికముగా ప్రేమ చూపించును. కనుక తనే వచ్చి తలుపు తెరవవలెనని నీలాదేవిని వెనుకకు లాగి, మంచముపై పడవైచి, ఆమెపై తాను అదిమిపట్టి పరుండి యుండి, ఆమె స్పర్శ సుఖముచే ఒడలు మరచి తలుపు తెరవక ఊరకుండెను. స్వామిని మేలుకొలిపి, తలుపులు తెరవవలసిందిగా నీలాదేవిని అర్థిస్తున్నారు. అంత ఆ ఆర్తనాదము విని తలుపు తెరచుటకు స్వామి వెళ్ళుచుండగా  --- తలుపులు తెరచుటకు వీలులేదని నీలాదేవి తన కళ్ళతో ప్రతిబంధించినది.  అది చూచి గోపికలు "అమ్మా ! ఇది న్యాయము కాదు" అని నీలాదేవిని అర్థించిరి.                 


        

తిరుప్పావై పాశురాలు ---- పద్దెనిమిదవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పద్దెనిమిదవ పాశురము
ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్వలియన్ 
నన్ద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ ! 
కన్దమ్ కమళుమ్ కుళలీ ! కడై తిరవాయ్ 
వన్దెజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి 
ప్పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్ 
పన్దార్ విరలి ! ఉన్ మైత్తునన్ పేర్పాడ 
చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప 
వన్దు తిరువాయ్ మగిళిందేలొ రెమ్బావాయ్. !



భావం:-
ఏనుగులతో పోరాడగలిగిన వాడును, మదము స్రవించుచున్న ఏనుగువంటి బలముకలవాడును, యుద్ధములో శతృవులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లుచున్న కేశపాశముగల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము. కోళ్ళు అంతట చేరి అరచుచున్నవి. మాధవీలత పాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చున్న కోకిలలు కూయుచున్నవి. కావున తెల్లవారినది, చూడుము. బంతి చేతిలో పట్టుకొనినదానా ! మా బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి, నీవు సంతోషముతో లేచి నడచివచ్చి, ఎర్రతామర పూవును బోలిన నీచేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము. 

అవతారిక:-
గోపికలు కృష్ణుని పొంది అనుభవింపవలెను అనెడి ఆవేశంతో కృష్ణపరమాత్మ అగుపడగానే తము అనుభవింపవచ్చునని ఆశపడి మేలుకొలిపిరి. కృష్ణుడు మేల్కోలేదు, ప్రక్కనే ఉన్న బలరాముని మేల్కొలిపిరి, ఐనను కృష్ణుడు మేల్కోలేకపోవుటచే .... నీలాదేవిని ఆశ్రయించవలెనని ఆమెను ఈ పాశురమున మేలుకొలుపుచున్నారు. 

అమ్మవారికి 'పురుషకారము' అని వ్యవహారము. ఆమె మధ్యవర్తిని. జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చునట్లు సర్వేశ్వరుని మార్చునది కావున ఆమెను 'పురుషకారము' అందురు. జీవులు తమ పాపములకు తామే నిష్కృతి ఒనర్చుకొని పరమాత్మను చేరలేరు. ఆమెను ఆశ్రయింపని వారు పరమాత్మను పొందలేరని గుర్తించి నీలాదేవిని గోపికలు మేలుకొలుపుచున్నారు. 

భగవానుని అమ్మవారిద్వారా ఆశ్రయించుట మహాకౌశలము. అట్టి కౌశలము కలవారగుటచేతనే భగవద్రామానుజులు శ్రీమన్నారాయణుని శరణము పొందుటకు ముందుగా అమ్మవారిని తమ శరణాగతి గద్యమున శరణము నొందిరి. 


  
                
             

తిరుప్పావై పాశురాలు ---- పదిహేడవ పాశురము

తిరుప్పావై పాశురాలు

పదిహేడవ పాశురము
అమ్బరమే , తణ్ణీరే శోఱే అఱమ్ శెయ్యుమ్ 
ఎమ్బెరుమాన్ ! నన్దగోపాలా! ఎళున్దిరాయ్, 
కొమ్బనార్కెల్లామ్ కొళున్దే ! కులవిళక్కే 
ఎమ్బెరుమాట్టి! యశోదాయ్! అఱివురాయ్! 
అమ్బర మూడఱుతోజ్ఞ్గి యులగలన్ద 
ఉమ్బర్ కోమానే ! ఉఱజ్ఞ్గాదెళున్దిరాయ్ 
శెమ్ పొర్కళ లడిచ్చెల్వా ! బలదేవా ! 
ఉమ్బియుమ్ నీయు ముఱజ్ఞ్గేలో రెమ్బావాయ్. !



భావం:-
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచినీరు కావలసినవారికి మంచినీరు, అన్నము కావలసినవారికి అన్నము, ప్రతిఫలాపేక్ష లేక ధర్మబుద్ధితో దానము చేయు నందగోపాలా, మాస్వామి మేలుకొనుము. సుకుమారము వంటి శరీరము గల స్త్రీలలో చిగురువంటి దానా మా వంశమునకు మంగళదీపము వంటిదానా, యశోదా మేలుకొనుము--- ఆకాశ మధ్యభాగమును చీల్చుకొని పెరిగి లోకములన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్య శూరులకు నాయకుడా ! నిద్రింపరాదు మేల్కొనుము. స్వచమైన బంగారముతో చేయబడిన కడియమును కాలిన దాల్చిన బలరామా ! నీవును - నీతమ్ముడును మేలుకొనవలెను. అని గోపికలు ఈ పాశురమున ప్రార్థించిరి. 

అవతారిక:-
గోపికలు ---- పదిమంది గోపికలను మేల్కొలిపి నందభవనమును చేరినారు. భవనపాలకుని ద్వారపాలకుని ప్రార్థించి వారి అనుమతిని పొందిరి. ద్వారపాలకుడు తలుపుతెరచి లోనికి వదలెను. గోపికలందరును నందగోపభవనమున ప్రవేశించిరి. నందగోపుడు, యశోద, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచములపై శయనించిరి. 

ఆచార్య సమాశ్రయణముచే మంత్రమును, మంత్రార్థమగు సర్వేశ్వరుని తెలుసుకొనినను చాలదు. ఆ సర్వేశ్వరుని ప్రేమించిన భాగవతులను ఆశ్రయించి వారిని ఆశ్రయించుట చేతనే భగవానుడు తమను అనుగ్రహించునని తెలుసుకొనవలెను. ఈ విషయమును తెలియచేయుచు నందగోపుని, యశోదను, శ్రీకృష్ణుని, బలరాముని ఈ పాశురములో గోపికలు మేలుకొలుపుచున్నారు.               


              

తిరుప్పావై పాశురాలు ---- పదహారవ పాశురము

తిరుప్పావై పాశురాలు
పదహారవ పాశురము
నాయగనాయ్ నిన్ర నన్దగోపనుడైయ 
కోయిల్ కాప్పానే ! కొడిత్తోన్రుమ్ తోరణ 
వాశల్ కాప్పానే ! మణిక్కదవమ్ తాళ్ తిరవాయ్ 
ఆయర్ శిరుమియరోముక్కు అరై పరై 
మాయన్ మణివణ్ణన్ నెన్నెలేవాయ్ నేర్ న్దాన్ 
తోయోమాయ్ వన్దోమ్ తుయిలెళప్పాడువాన్ 
వాయాల్ మున్నమున్నమ్ మాత్తాదే అమ్మా! నీ
నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్. !



భావం:-- 
అందరకును నాయకుడై ఉన్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలకా ! లోనికి విడుపుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వరమును కాపాడు ద్వారపాలకా ! మణులచే సుందరమైన తలుపులు గడియను తెరువుము. గోప బాలికలమగు మాకు మాయావియు, మణివర్ణుడను అగు శ్రీకృష్ణపరమాత్మ ధ్వనిచే 'పర' అను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట ఇచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి ఇచ్చిన వారము కాము. పరిశుద్ధ భావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేలుకొలుపుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ ! ముందుగానే నీవు కాదు అనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదానిని ఒకటి చేరి బిగువుతో నిలిచి ఉన్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయు. అని గోపికలు భవన పాలకుని, ద్వార పాలకుని అర్థించిరి. 

అవతారిక:-
గోపికలు --- నిద్రపోతున్న ఆనందవ్రజమున కృష్ణసంశ్లేష యోగ్యత కల గోపికలను అందరిని మేలుకొలుపుకొని నందగోప భవనమును చేరుకొనిరి. భగవానుని ఆశ్రయించినపుడు మహాపురుషుల ద్వారా ఆశ్రయించాలి అని చెప్పుచుందురు. అందుకే తాము కూడా భవనపాలకుని, ద్వారపాలకుని ప్రార్థించి -- నందగోపుని ఆశ్రయించి కృష్ణపరమాత్మను పొందాలని యత్నించుచున్నారు. 

దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ క్షేత్రపాలకుని ముందుగా సేవించి --- ద్వారపాలకుని, అమ్మవారిని, ప్రధానదైవాలని సేవించాలి. అంతర్యామిని ఉపాసన చేయువారు ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును వశపరచుకొని బుద్ధిద్వారా ఆత్మా స్వరూప జ్ఞానముతో పరమాత్మను ఉపాసింతురు. ఇవి అన్నియు కలసివచ్చునట్లు ఆండాళ్ళు ఈ వ్రతమును ప్రతిపాదించుచు కృష్ణావతారమున గోపికలు ఏ విధంగా శ్రీకృష్ణుని చేరిరో, ఆలయంలో దైవమును సేవించుటకు ఏ విధంగా వెళ్ళెదరో , భగవత్ ఉపాసన చేయువారు ఏ విధంగా ఉపాసింతురో మనకు ఈపాశురంలో తెలియచేసెను.